వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో ఏటీఎం కస్టోడియన్ వ్యాన్ నుండి రూ. 17 లక్షలు చోరీ చేసిన తండ్రీకుమారుల ఉదంతంలో, కుమారుడిని కొండగట్టులోని ఒక లాడ్జిలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 10 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడైన తండ్రి శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మల్యాల ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక బృందాలు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశాయి.
Comments
Loading comments...

