వార్తలకు తిరిగి వెళ్లండి
హిమాచల్లో ఘోర ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్-స్పితిలో ఘోర ప్రమాదం జరిగింది. పంగీ-కిలాద్ రహదారిపై వెళ్తున్న కారుపై కొండచరియలు విరిగిపడటంతో ఆరు నెలల పసికందు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
కుల్లు నుంచి పంగీ వెళ్తున్న టాటా సుమోపై బండరాళ్లు పడటంతో వాహనంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 15 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...