వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి తప్పిపోయిన మూడేళ్ల బాలుడు వేదాన్ కుటుంబాన్ని సీపీ సాయిచైతన్య శనివారం రాత్రి పరామర్శించారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని సీపీ తెలిపారు.
చిన్నారి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ ఇప్పటికే చేపట్టిన చర్యలను కమిషనర్ సమీక్షించారు.
Comments
Loading comments...

