వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న వి.సోమయ్య అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులు బయటపడ్డాయి.
వివిధ ప్రాంతాల్లో ఇళ్లు, భూములు, ఓపెన్ ప్లాట్లతో పాటు నగదు, బంగారం, వాహనాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా ఈ ఆస్తుల విలువ రూ.3.54 కోట్లు ఉంటుందని అంచనా వేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...

