వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ వివేక్ యాదవ్

ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు.
అర్హులైన వారు సరైన డాక్యుమెంట్లతో జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు మళ్లీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...