వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు CJPతో కేంద్ర మంత్రుల చర్చలు

CJP ప్రతినిధులతో కేంద్ర మంత్రుల ఉన్నత స్థాయి సమావేశం ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరగనుంది. తటస్థ వేదికపై జరిగే ఈ చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ ప్రధాన డిమాండ్లను ప్రస్తావిస్తామని CJP ప్రకటించింది.
మరోవైపు, తమ డిమాండ్ల సాధన కోసం నేడు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు CJP పిలుపునిచ్చింది. ఈ భేటీ ఫలితంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...