వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన ప్రజాసేవ, సంక్షేమ పథకాలను నాయకులు స్మరించుకున్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాళ్ల నర్సింగం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

