Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రుల సేవే తీర్థయాత్ర

Follow Udayam Digital on Google
భరత్ తేజ Aug 10, 2026 7:16 AM ఆల్ ఇండియా జాతీయ
తల్లిదండ్రుల సేవే తీర్థయాత్ర - Udayam Digital
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన సంజీవ్‌ కుమార్‌, అనిల్‌ కుమార్‌ వయోవృద్ధ తల్లిదండ్రులను కావడిలో మోస్తూ హరిద్వార్‌ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు నడిచారు. కావడి యాత్రలో గంగాజలాన్ని సేకరించి తిరుగు ప్రయాణమయ్యారు. సోదరుల తల్లిదండ్రుల సేవను చూసిన సహ యాత్రికులు వారిని ‘కలియుగ శ్రవణకుమారులు’గా ప్రశంసించారు. అమ్మానాన్నల సేవే తమకు అత్యున్నత తీర్థయాత్ర అని సంజీవ్‌, అనిల్‌ తెలిపారు.

Comments

G
Loading comments...