వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మండల వ్యవసాయ మార్కెట్కు 893 బస్తాల పెసలు వచ్చాయని మార్కెట్ కార్యదర్శి షంషేర్ తెలిపారు. 124 మంది రైతులు తమ పెసలను మార్కెట్కు తీసుకువచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాకు రూ.8,780గా ఉంది.
మార్కెట్లో గరిష్ఠ ధర రూ.7,759, మధ్యస్థ ధర రూ.6,369, కనిష్ఠ ధర రూ.5,300 పలికిందని తెలిపారు. రైతులు నాణ్యమైన పెసలను మార్కెట్కు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు.
Comments
Loading comments...

