Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల ఘాట్‌లో ఘోర ప్రమాదం

Follow Udayam Digital on Google
తిరుమల ఘాట్‌లో ఘోర ప్రమాదం - Udayam Digital
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొని లోయలో పడింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన సతీశ్‌కుమార్‌ చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో 22వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...