వార్తలకు తిరిగి వెళ్లండి
పూణేలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం: 14 మంది రక్షణ

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పూణే పింప్రి-చించ్వాడ్ పరిధిలోని ఒక రీసైక్లింగ్ ప్లాంట్లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న 14 మంది కార్మికులను అధికారులు సురక్షితంగా రక్షించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబైలో భవనం కూలి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, వరద ముంపు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Comments
Loading comments...