వార్తలకు తిరిగి వెళ్లండి

పూరీ జగన్నాథ స్వామి ‘స్నాన పూర్ణిమ’ అనంతరం శ్రీజగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి అనాసర (ఏకాంత) సమయానికి వెళ్లారు. వార్షిక దివ్య స్నానం తర్వాత స్వామివారికి జ్వరం వచ్చిందని, అర్చకులు మూలికా వైద్యం అందిస్తున్నారని నమ్ముతారు. ఈ సమయంలో పూరీ ఆలయంలో దర్శనాలు నిలిచిపోతాయి.
ఈ అనాసర కాలంలో జగన్నాథుడే బ్రహ్మగిరిలోని ఆలర్నాథ్ రూపంలో దర్శనమిస్తాడని భావించి, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలర్నాథ్ ఆలయానికి పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

