వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరులో మూడు కొవిడ్ కేసులు నమోదు

గుంటూరు జిల్లాలో తాజాగా మూడు కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మంగళగిరికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన ఒక వృద్ధురాలికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు.
బాధితుల ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఒకరిని ఎయిమ్స్లో చేర్చినట్లు పేర్కొన్నారు. వైరస్ రకాన్ని గుర్తించేందుకు నమూనాలను పుణె ల్యాబ్కు పంపినట్లు డీఎంహెచ్వో విజయలక్ష్మి తెలిపారు.
Comments
Loading comments...