వార్తలకు తిరిగి వెళ్లండి
పల్నాడులో గంజాయి రవాణాపై ఉక్కుపాదం

పల్నాడు జిల్లాలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న గుంటూరుకు చెందిన శివప్రసాద్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నేర చరిత్ర ఆధారంగా ప్రభుత్వం అతనిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంది.
ఉత్తర్వుల ప్రకారం నిందితుడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. గంజాయి విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, రవాణాపై నిఘా తీవ్రం చేశామని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...