వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో ఉపాధి కూలీల నుంచి వారానికి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పని చేయకపోయినా ఫొటోలు దిగితే చాలంటూ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ప్రశ్నించిన కూలీల హాజరును తగ్గించి వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

