వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక నిర్మాణాల తొలగింపు నేపథ్యంలో స్వర్ణ, వెండి వాహనాలను భద్రత మధ్య రంగనాయకులగుట్టకు తరలించారు. నగల మ్యూజియంలోని ఆభరణాలను కూడా భద్రపరిచే చర్యలు చేపట్టారు.
రోజువారీ పూజలకు ఉపయోగించే ఆభరణాలను అర్చకులకు అప్పగించగా, మిగిలిన వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
Comments
Loading comments...
