వార్తలకు తిరిగి వెళ్లండి
తెలుగు పండిత్ నియామకానికి విద్యార్థుల ఆందోళన
కిరణ్ కుమార్ Jun 23, 2026 9:32 AM మహబూబ్నగర్ 4 viewsabout 1 hour ago

మహమ్మదాబాద్ మండలం జూలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడాదిగా తెలుగు పండిత్ పోస్టు ఖాళీగా ఉండటంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పీడీ అదనపు బాధ్యతలు నిర్వహించినా, అది పూర్తిస్థాయి బోధనకు సరిపోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే తెలుగు పండిత్ను నియమించాలని కోరుతూ డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Loading comments...