వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు సమస్యలపై సర్కార్ నిర్లక్ష్యం
ప్రణీత రెడ్డి Jun 23, 2026 9:05 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago

ఎల్లారెడ్డిలో యూరియా కొరతపై రైతుల నిరసనకు వెళ్తున్న తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలనని ఆయన మండిపడ్డారు.
యూరియా యాప్ రద్దు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో గొంతు నొక్కాలని చూసినా రైతుల తిరుగుబాటును ఆపలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments
Loading comments...