వార్తలకు తిరిగి వెళ్లండి
ఓపెన్ ఏఐ సీటీఓగా తెలుగు వ్యక్తి

ఓపెన్ఏఐ కంప్యూట్ విభాగం నూతన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా తెలుగు నిపుణుడు ఉదయ్ రుద్దర్రాజు నియమితులయ్యారు. ఏడాది క్రితం సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్గా చేరిన ఆయనకు, ఎక్స్ఏఐలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ పదోన్నతి వివరాలను ఆయన లింక్డ్ఇన్లో పంచుకున్నారు.
జీపీటీ 5.6 వంటి సరికొత్త మోడళ్లకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా తమ బృందం పనిచేస్తోందని ఉదయ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఓపెన్ఏఐలో ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూట్ ఫుట్ప్రింట్ను నిర్మించడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...