వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టీ-ఫైబర్)కు ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్’ అవార్డు దక్కింది. ఇటీవలి వివిధ విభాగాల మూల్యాంకనంలో టీ-ఫైబర్ అగ్రస్థానంలో నిలిచి ఈ గౌరవాన్ని దక్కించుకుంది.
న్యూఢిల్లీలో జూన్ 20న నిర్వహించనున్న 108వ స్కోచ్ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘వికసిత్ భారత్ కోసం నియంత్రణ చట్రం’ అనే అంశంపై జరగబోయే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా టీ-ఫైబర్కు అధికారిక ఆహ్వానం అందింది.
Comments
Loading comments...

