వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొల్లపల్లి గణేశ్ కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో ‘తెలంగాణ బడి’ వెబ్సైట్ను రూపొందించారు.
ఈ వేదిక ద్వారా 6-10 తరగతుల విద్యార్థులకు తెలుగు పాఠాలు, వ్యాకరణాంశాలు బొమ్మలు, పటాలు, నమూనా పరీక్షల రూపంలో సులభంగా అర్థమయ్యేలా అందుబాటులో ఉన్నాయి. దివ్యాంగుడైన ఈ ఉపాధ్యాయుడు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా అందుకున్నారు.
Comments
Loading comments...
