వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు గంటల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

