వార్తలకు తిరిగి వెళ్లండి
17న తెలంగాణ కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల వంటి పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంపు ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఆర్థిక శాఖ కొర్రీలతో పెండింగ్లో పడిన నీటిపారుదల శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం సీఎంను కలిసి ఈ అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...