వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Neha Singh Jun 18, 2026 11:29 AM హైదరాబాద్ 16 views4 days ago

జూన్ 30న వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏడు రకాల సన్నాలకు బోనస్ ప్రకటించడంతో పాటు, నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది.
కేంద్రం నుంచి ధాన్యం సేకరణ, ఎరువుల కోటాను పెంచాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే, మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...