వార్తలకు తిరిగి వెళ్లండి
అపరిశుభ్రతతో భక్తుల ఆందోళన
Harika Jun 22, 2026 7:12 AM యాదాద్రి భువనగిరి 1 viewsabout 2 hours ago

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని పుష్కరిణి నీరు కలుషితమై దుర్వాసన వస్తోంది. వారాల తరబడి నీటిని మార్చకపోవడంతో భక్తులు స్నానాలు ఆచరించడానికి భయపడుతున్నారు. ఈ కలుషిత నీటి వల్ల రోగాలు వ్యాపిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పుష్కరిణి నిర్వహణపై దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. పవిత్రమైన పుష్కరిణిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.
Comments
Loading comments...