వార్తలకు తిరిగి వెళ్లండి
టెకీ రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్

విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె భర్త శ్రీచరణ్ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు.
తమ కుమార్తెను భర్తే అత్యంత ఘోరంగా హత్య చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ కలెక్టర్ ఈ ఉదంతంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...