వార్తలకు తిరిగి వెళ్లండి
ఆటో బోల్తాపడి వ్యవసాయశాఖ ఉద్యోగి బలి

పాలకొల్లులో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వాహనం బోల్తాపడి ముమ్మిడివరం వ్యవసాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ గుబ్బల సత్యనారాయణ (57) అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్కు వెళ్తుండగా దేశాలమ్మ ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఆయన భార్య రాజేశ్వరితో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పాలకొల్లు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...