Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శీర్షిక: టీమిండియాలో ఇద్దరు ఔట్, ఇద్దరు ఇన్!

మహేష్ కుమార్ Jul 12, 2026 1:55 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
శీర్షిక: టీమిండియాలో ఇద్దరు ఔట్, ఇద్దరు ఇన్! - Udayam Digital
గాయాల బెడదతో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, జింబాబ్వేతో టీ20 సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో బీసీసీఐ రెండు కీలక మార్పులు చేసింది. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతూ కండరాల గాయాల బారినపడిన హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు తదుపరి సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యారు. వీరిద్దరి స్థానాల్లో రిప్లేస్‌మెంట్ ప్లేయర్లను బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు హర్షిత్ రాణా స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను ఎంపిక చేయగా.. జింబాబ్వేతో జరిగే టీ20లకు వరుణ్ చక్రవర్తి స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు జట్టులో అవకాశం కల్పించింది. జులై 14 నుంచి ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...