వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా గ్రూపునకు చెందిన కొత్త తరం వ్యాపార సంస్థల భవిష్యత్తు మార్గసూచీపై వాటి సీఈఓలు టాటా సన్స్ బోర్డు సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తులో భారీ లాభాలు తెచ్చిపెట్టగలవని భావిస్తున్న ఎయిరిండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థల వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా, బోర్డు సభ్యులు హాజరైన ఈ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించలేదు. జూన్ 12న జరగబోయే తదుపరి సమావేశంలో ప్రస్తుత ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

