వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సెప్టెంబరు 1 నుంచి కార్ల ధరలను రూ.25,000 వరకు పెంచనుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది.
ఈ పెంపు ఐసీఈ, ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుందని, మోడల్ను బట్టి ధర పెంపు మారుతుందని వెల్లడించింది. ముడి పదార్థాల భారం మొత్తాన్ని వినియోగదారులపై వేయడం లేదని పేర్కొంది.
Comments
Loading comments...

