వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలోని పెద్దేముల్ వసతిగృహంలో 10వ తరగతి చదువుతున్న అక్షిత్ (14) గురువారం ఉదయం టిఫిన్ సమయం నుంచి కనిపించకుండా పోయాడు. గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో హాస్టల్ పీడీ, బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ హాస్టల్లో విద్యార్థి అదృశ్యం స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...

