వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ సాయిబాబా పల్లకి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల అనంతరం పల్లకి సేవను ప్రారంభించారు. భజన కీర్తనలతో సాగిన ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, సాయిబాబా దీవెనలతో పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని చైర్పర్సన్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...
