వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండలం గుంతబాసుపల్లిలోని ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం కలకలం రేపింది. కర్ణాటక నుంచి వచ్చిన నలుగురు ఈ తవ్వకాలు జరిపినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో దశాబ్దాలుగా ఉన్న పాముల పుట్టను సైతం తవ్వేసినట్లు సమాచారం.
పక్కనే అంగన్వాడీ కేంద్రం ఉండటంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Loading comments...

