Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి ఎస్సీ కాలనీలో కలుషిత నీటి సమస్య

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 7:24 PM గుంటూరుGeneral
తాడేపల్లి ఎస్సీ కాలనీలో కలుషిత నీటి సమస్య - Udayam
తాడేపల్లి రన్నింగ్ రూమ్ సెంటర్ ఎస్సీ కాలనీలోని డ్రైనేజీ గుండా వెళ్తున్న మంచినీటి పైపును పక్కకు తొలగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం 6వ వార్డు సచివాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సైడ్ కాలువలోనే పైపు ఉండటం వల్ల మురుగునీరు కలసి మంచినీరు కలుషితమవుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...