వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో సీపీఐ చేపట్టిన “మార్పు కోసం ప్రచార పాదయాత్ర” ఐదో రోజు సవరమ్మ కాలనీలో కొనసాగింది. 18, 19వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు.
పేదలకు రేషన్ కార్డులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నూతన పింఛన్లు మంజూరు చేయాలని సీపీఐ నాయకులు డి. రాజా సాహెబ్, ఎన్. రామాంజనేయులు డిమాండ్ చేశారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించి సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు.
Comments
Loading comments...

