వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ గురువారం పరిశీలించారు.
వేదిక, పతాకావిష్కరణ స్థలం, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

