వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను డీఐజీ రాజ కుమారి, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ బుధవారం పరిశీలించారు. ఈ నెల 13న జరగనున్న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్తో పాటు సీఎం,మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారుల కూర్చునే ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
వేడుకలకు వచ్చే అతిథులు, ప్రజల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

