వార్తలకు తిరిగి వెళ్లండి
సుప్రీంకోర్టులో పిటిషనర్ రగడ: జడ్జిలపైకి పత్రాల విసిరేత

సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా ఓ పిటిషనర్ తీవ్ర పదజాలంతో న్యాయమూర్తులపై విరుచుకుపడ్డాడు. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం ఎదుట ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది.
అనంతరం నిందితుడు తన కేసు పత్రాలను న్యాయమూర్తుల డయాస్ వైపు విసిరేయడంతో కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని బలవంతంగా బయటకు తరలించారు.
Comments
Loading comments...