వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రపంచ రికార్డుల వేటలో దేశీ రైతు

కర్ణాటకలోని సక్లేష్పూర్ పనస మేళాలో 72 కేజీల బరువైన పనస పండు అందరినీ ఆశ్చర్యపరిచింది. హెబ్బనహళ్లికి చెందిన ప్రతాప్ కుమార్ తన తోటలో పండిన ఈ భారీ కాయలను ప్రదర్శనకు ఉంచగా, వీటిని ఇద్దరు కలిసి ఎత్తాల్సి వచ్చింది.
ప్రస్తుతం గిన్నిస్ రికార్డుల్లో ఉన్న ఫ్లోరిడా పనస పండు (54.43 కిలోలు) కంటే ఇది చాలా బరువైనది. దీంతో ఈ దేశీ పనసను ప్రపంచ రికార్డు నమోదు కోసం పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...