Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌లో మోదీకి అరుదైన గౌరవం

రూపేష్ గౌడ్ Jul 10, 2026 11:01 AM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago
న్యూజిలాండ్‌లో మోదీకి అరుదైన గౌరవం - Udayam Digital
న్యూజిలాండ్ పర్యటనకు విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆఖరి విడతగా ప్రధాని మోదీ ఈ రోజు న్యూజిలాండ్ చేరుకున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని ఆక్లాండ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కై టవర్‌ను భారత త్రివర్ణ పతాక రంగులతో అలంకరించారు. ప్రధాని మోదీ పట్ల గౌరవ సూచకంగా న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Comments

G
Loading comments...