వార్తలకు తిరిగి వెళ్లండి
కళాకారుల కుటుంబాలకు అండగా తితిదే

రోడ్డు ప్రమాదంలో మరణించిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ (HDPP) కళాకారులు నాగరాజు, చక్రవర్తి కుటుంబాలకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆర్థిక భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా రూ.25 వేలు ప్రకటించారు.
అంతేకాకుండా, వారి పిల్లలకు డిగ్రీ వరకు తితిదే విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించనున్నట్లు వెల్లడించారు. శనివారం వడమాలపేట వద్ద జరిగిన ప్రమాదంలో వీరు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...