Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా స్మగ్లింగ్ బంగారం పట్టివేత

రూప దేవి Jun 25, 2026 5:26 PM హైదరాబాద్ 17 viewsabout 12 hours ago
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా స్మగ్లింగ్ బంగారం పట్టివేత - Udayam Digital
కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 3.36 కోట్ల విలువైన 2.271 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ ప్యాంట్లలో లోపలి వైపు సీక్రెట్ పాకెట్లు కుట్టించుకుని, అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని దాచి తరలిస్తున్నారు. డీఆర్ఐ (DRI) పక్కా సమాచారంతో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు వారిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్నదెవరనే కోణంలో ప్రస్తుతం లోతుగా విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...