వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 28న పల్స్ పోలియో 'బూత్ డే' నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో 62,902 మంది చిన్నారులకు చుక్కలు వేయడానికి 381 బూత్లు, మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
వలస కూలీల పిల్లలకు కూడా చుక్కలు వేయాలని, వైద్య ఆరోగ్యశాఖతో పాటు ఇతర అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ చిన్నారి మిగిలిపోకుండా చూడాలని సూచించారు.
Comments
Loading comments...

