వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థుల భవిష్యత్ను గాలికి వదిలేశారు

కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితి లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. చుంచుపల్లిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను సకాలంలో విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Comments
Loading comments...