వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటుండటంపై మనస్తాపంతో ఇంజినీరింగ్ విద్యార్థి పురుగుల మందు తాగి మృతి చెందాడు. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన కిరణ్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
మనస్పర్థలతో తల్లిదండ్రులు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. వారు మళ్లీ కలుస్తారో లేదోనన్న బాధతో గురువారం పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
Comments
Loading comments...

