వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నుండి స్టూడెంట్ బస్పాస్లు జారీ చేయనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ ఎం.రాజశేఖర్ తెలిపారు. విద్యార్థులు ఫ్రీ, రూట్, జనరల్ వంటి వివిధ రకాల పాసుల కోసం అధికారిక వెబ్సైట్ (online) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలకు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల నుండి మినహాయింపు ఇచ్చారు. ప్రైవేట్ సంస్థలు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 80082 04216 నంబరును సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

