వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు అల్పాహారం వరం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించడం గొప్ప వరమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా దామెరలో పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...