వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మాణ పనులు త్వరగా పూర్తి

కొడంగల్ నియోజకవర్గంలోని విద్యా సంస్థల నిర్మాణ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సీఎం ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బొంరాస్పేట, హకీంపేట హబ్ పనులను పరిశీలించి, నాణ్యత విషయంలో రాజీ పడకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.
నిధుల సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు.
Comments
Loading comments...