Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా సంస్థల్లో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 02, 2026 6:06 PM నిజామాబాద్General
విద్యా సంస్థల్లో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు - Udayam
విద్యా సంస్థల్లోకి అక్రమంగా ప్రవేశించి, సిబ్బందిని బెదిరిస్తూ అల్లర్లకు పాల్పడుతున్న విద్యార్థి సంఘాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. నిజామాబాద్ పరిధిలో జరిగిన పలు ఘటనలపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యలు ఉంటే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...