వార్తలకు తిరిగి వెళ్లండి
ఆహార, ఔషధ కల్తీలపై ఉక్కుపాదం: సీఎం రేవంత్ ఆదేశం!

తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి రూపకల్పన చేసే నూతన చట్టం అత్యంత కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసరాలు కల్తీ అవుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో 'TGFADCA' చట్టంపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
కల్తీలపై క్షేత్రస్థాయి సమాచార సేకరణ కోసం ప్రత్యేకంగా 'విజిల్ బ్లోయర్లను' నియమించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Loading comments...